జనసేనానికి సంఘీభావం తెలిపిన కువైట్ జనసేన

కువైట్, ఇటీవల జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై జరిగిన రెక్కీ మరియు గత నెలలో వైజాగ్ లో ఆయన పర్యటనలో భాగంగా అధికార వైసిపి దౌర్జన్యాన్ని నిరసిస్తూ… ఈ వైసిపి అధికార దుర్వినియోగాన్ని ఖండిస్తూ… జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యం లో కువైట్ లోని జనసైనికులు ఏకమై అధినాయకుడు పవన్ కళ్యాణ్ కి సంఘీభావంగా మరియు పార్టీకి మద్దతుగా కువైట్ నుండి జనసైనికులు తమ గళాన్ని వినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కువైట్ జనసేన నాయౌకులు గంటా రమేష్‌ రాయల్‌, షేక్‌ అలీ, కొట్టే శ్రీహరి, యర్రశెట్టి హరిబాబు రాయల్‌ తదితర కువైట్ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.