నాయి బ్రాహ్మణ సంఘంకు ఆర్థిక సహాయం చేసిన శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తిలోని నాయి బ్రాహ్మణుల సంఘం నాయకులు శనివారం శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటాని పార్టీ కార్యాలయంలో కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. అలాగే సంఘం నాయకులు చేస్తున్న త్యాగరాజ ఆరాధన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. నాయి బ్రాహ్మణులు చేస్తున్న త్యాగరాజ ఆరాధన కార్యక్రమంకు 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వినుత కోటా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని ఈ సారి ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరుతూ, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నాయి బ్రాహ్మణులకు పూర్తి స్థాయిలో ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. నాయి బ్రాహ్మణులలో చదువుకున్న యువత ఉద్యోగాలు లేక, ఒక పక్క కుల వృత్తి చెయ్యలేక ఇబ్బందులు పడుతున్న విషయం బాధాకరమని, అధికారంలోకి రాగానే చదువుకున్న యువతకి ఉచితంగా ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.