ముద్రగడను జనసేనలోకి ఆహ్వానించిన లింగోలు పండు

కిర్లంపూడి: కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభంను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన అమలాపురం రూరల్ మండల అధ్యక్షుడు లింగోలు పండు. ఈ సందర్భంగా లింగోలు పండు ముద్రగడ పద్మనాభంను జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీకి మీలాంటి పెద్దల సూచనలు సలహాలు ఉండాలని ముద్రగడ పద్మనాభంని పండు కోరగా వీటికి పద్మనాభం సానుకూలంగా స్పందించారు.