గిద్దలూరులో ప్రజాగళం నిర్వహించిన ముత్తుముల అశోక్ రెడ్డి

గిద్దలూరు నియోజకవర్గం, బెస్తవారపేట మండలంలో ప్రజాగళం నిర్వహించడం జరిగింది. ఒబినేనిపల్లె, రెట్టపల్లె, చిన్న ఓబినెనిపల్లె, మల్లపురం, కొత్త మళ్లపురం, కలగొట్ల, నేకునాంబాద్, చెట్టీచెర్ల, పూసలపాడు, పందిళ్ళపల్లె, మోక్ష గుండం, ఝెబికె పురం గ్రామాలలో ప్రజాగళం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్.డి.ఏ కూటమి అభ్యర్ధి ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు, జిల్లా కార్యదర్శి లంకా నరసింహ రావు, సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య మండల అధ్యక్షులు ముంతల మధుసుధన్ రెడ్డి, కార్యదర్శి అనిల్, మండలం ప్రధాన కార్యదర్శి దమ్ము తిరుపాలు, కంట రమణ, వెంకట స్వామి, సిద్దం వెంకటేశ్వర్లు, పరశురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.