వంగవీటి రంగాకు నివాళులు అర్పించిన ముత్తా శశిధర్

కాకినాడ సిటి: కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు & కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ & సిటి అధ్యక్షులు తోట సుధీర్ నేడు వంగవీటి మోహన రంగా వర్ధంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించడం జరిగింది. 44వ డివిజన్ శారదా దేవి గుడి ప్రాంతంలో అగ్రహారపు సతీష్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ రంగా విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పేదల తరపున పోరాడటానికి ఆయన ఏనాడు ఆలోచించలేదన్నారు. పిలిచినది ఏవరైనా పలికేవారనీ అందుకే ఇన్ని దశాబ్దాలు అయినా నేటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారని కొనియాడారు. పోరాడటం అంటే ఆయన నుండే నేర్చుకోవాలనీ, ఆయన స్పూర్తిని మనమందరం మరువకూడదని జోహార్లు అర్పించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ సిటి జనసేన పార్టీ అధ్యక్షులు తోట సుధీర్ మాట్లాడుతూ రంగా అంటే ఒక అలుపెరగని కెరటం అనీ, తన లక్ష్యంకోసం ప్రాణాలను సైతం లెక్కచేయలేదని అన్నారు.