దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు విశాఖ జనసేన నాయకులు

వైజాగ్ ఈస్ట్: తూర్పు విశాఖపట్నం, 15 వార్డు, దుర్గా నగర్ లో దుర్గాదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబా ప్రసాద పంపిణీ మరియు మజ్జిగ పంపిణీ చాలామంది భక్తుల దాహం తీర్చడంలో ఉపయోగపడింది. శ్రీమతి సరనీదేవి తూర్పు నియోజకవర్గం నుండి 5వేల రూపాయల రూపాయలు అమ్మవారి గుడి నిమిత్తమై అన్నదానానికి విరాళంగా అందించారు. ఈ కార్యక్రమానికి నందిత, రాజేశ్వరి, పోతు ప్రసాద్, శ్రీనివాస్, విక్రమ్ బాబు రామడుగు(వి.బి.ఆర్) తూర్పు నియోజకవర్గం నుండి హాజరయ్యారు. మరియు ముఖ్యఅతిథిగా పంచకర్ల సందీప్ విచ్చేసి అమ్మవారి పూజలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని ప్రసాద పంపిణీ కార్యక్రమం చేశారు.