కూటమి గెలిపే నా లక్ష్యం కూటమితోనే అభివృద్ధి: శ్రీరామ్ నరసింహనాయుడు

పాలకొండ: కూటమి నాయకులపై నమ్మకంతోనే వైసీపీ పార్టీని వీడుతున్నట్లు బిటివాడ సర్పంచ్‌ అన్నారు. ఆదివారం కూటమి నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట రావు, ఉమ్మడి పార్టీల పాలకొండ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ, జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు గారి సమక్షంలో బిటివాడ సర్పంచ్‌ తన అనుచరగణంతో వైసీపీకి గుడ్‌ బై చెప్పి జనసేన పార్టీలో చేరారు. కూటమి గెలుపుతోనే అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతోనే.. చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్నేనా అప్పలనాయుడు అరకు పార్లమెంటరీ బీసీ సెల్ కన్వీనర్ పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, మండల నాయకులు మిడతాన ప్రసాద్, జనసేన పార్టీ వీరగొట్టం మండలం నాయకులు గర్భాపు నరేంద్ర, వీరగొట్టం మండల పార్టీ అధ్యక్షులు ఉదయాన ఉదయ్ భాస్కర్, మాజీ జెడ్పిటిసి గేదెల రమేష్ నాయుడు, స్థానిక నాయకులు సతివాడ వెంకటరమణ, లింగాలు చంటి మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.