నా సేన కోసం నా వంతు కార్యక్రమం
అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టి సి వరుణ్ సూచన మేరకు.. కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం ముద్దలాపురం గ్రామంలో “నా సేన కోసం నా వంతు” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
సెప్టెంబర్ రెండవ తేదీన కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా (క్రౌడ్ ఫండింగ్) గురించి తెలియజేసి జనసైనికులతో పార్టీకి ఫండ్ పంపించడం జరిగింది… అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ అభివృద్ధి కోసం 7288040505 ఈ నెంబర్ కు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా పార్టీకి ఫండ్ ఇవ్వాలని అనంతపురం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ తెలియజేశారు… ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి కార్యకర్తలు అందరూ కలిసి జనసేన పార్టీకి డొనేషన్ ఇవ్వడం ద్వారా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరింతగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది అని తెలియజేశారు… ఈ పార్టీ ఫండింగ్ ద్వారా పార్టీ అభివృద్ధి జరిగి ప్రజలకు మంచి జరుగుతుంది అని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ బ్రహ్మసముద్రం మండలం అధ్యక్షులు ఆంజనేయులు, కార్యక్రమాల కమిటీ మెంబర్ ఎర్రి స్వామి, జనసేన వీర షేక్ తార, జాకీర్, చిత్తప్ప, రామంజి, అబ్దుల్, మోహన్ జన సైనికులు పాల్గొన్నారు…