“నా సేన కోసం నా వంతు” కార్యక్రమాన్ని ప్రజల్లో బలంగా తీసుకువెళ్లాలి: గాదె

నరసరావుపేట, స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సయ్యద్ జిలాని అధ్యక్షత “నా సేన కోసం…నా వంతు” కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని జిల్లాలో ఉన్న రాష్ట నాయకులకు, జిల్లా కమిటీ సభ్యులకు, మండల మరియు నగర అధ్యక్షులకు కార్యక్రమం గురించి వివరించి భవిష్యత్ కార్యచరణలో ఈ కార్యక్రమాన్ని జనాలో బలంగా తీసుకొని వెళ్లాలని ప్రతి ఒక్కరికీ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, వడ్రాణం మార్కండేయులు, నాయబ్ కమాల్, బండారు రవి కాంత్, జిల్లా కమిటీ సభ్యులు అడపా మాణిక్యాలరావు, నామదాసు రామచంద్ర ప్రసాద్, ఉప్పు రతయ్య, అద్దెపల్లి ఆనంద్, బెల్లంకొండ ఈశ్వర్, అధికార ప్రతినిధులు తవిటి భవన్ నారాయణ, ఆళ్ళ హరి, వంశీ, మండల అధ్యక్షులు నగర అధ్యక్షులు నరసరావుపేట టౌన్ జనసేనకులు పాల్గొన్నారు.