క్రియాశీలక సభ్యునికి భీమా చెక్కు అందజేసిన నాదెడ్ల
మంగళగిరి నియోజకవర్గం: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం వీరమ్మకాలనికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు పసుపులేటి మల్లికార్జున రావుకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పంపిన ప్రమాద వైద్య ఎలవెన్స్ 50000 రూపాయల చెక్ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెడ్ల మనోహర్ అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు, రాజుపాలెం మండలం అధ్యక్షులు తోట నరసయ్య, రాజుపాలెం మండలం కార్యదర్శి కంభంపాటి వరప్రసాద్, సంయుక్త కార్యదర్శి పసుపులేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-08-at-6.17.43-PM-1024x682.jpeg)