నాదెండ్ల మనోహర్ మాట కాకినాడ సిటీలో అందరి నోట

కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాలతో నాదెండ్ల మనోహర్ మాట కాకినాడ సిటీలో అందరి నోట కార్యక్రమం 15వ డివిజన్ ఏటిమొగ కొండబాబు కాలనీ దగ్గర రచ్చా ధనలక్ష్మి ఆధ్వర్యంలో వద్ద జరిగింది. జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ నాలుగున్నర ఏండ్లు దోచుకో దాచుకో కార్యక్రమాలు చాపకింద నీరులా ఈ వై.సి.పి నాయకులు చేసుకుంటూ ప్రజలను దోచేసుకున్నారనీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో సాధికార యాత్రలు, ఆడుదాం ఆంధ్రా లాంటి రక రకాల మాయలు చేస్తూ సరికొత్త నాటకాలకి తెరలేపుతున్నారన్నారు. ఈ ముఖ్యమంత్రి చేసిన అవినీతికి ఫలితం ప్రజలు తమరక్తాన్ని చెమటగా మార్చి రకరకాల పన్నులు కడుతూ గగ్గోలు పెడుతున్నారన్నారు. రకరకాల పధకాల పేర్లతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్లు మేసేసరని వింటున్నామనీ, మరి విననివి ఇంకెన్నో అన్నారు. ఈ కార్యక్రమంలో బుజ్జమ్మ, ఈశ్వరి, నాగమణి, అనసూయ, అజ్జమ్మ, శాంతి, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.