జనసేన 69వ రోజు జనంకోసం జనసేన కార్యక్రమంలో పాల్గొనున్న నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ వారి ఆదేశాల ప్రకారం జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, షేక్ జమల్ అలీ లు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్చార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర ని కలిసి జరగబోయే కార్యక్రమం గురించి, కార్యక్రమం జరిగే రూట్ మ్యాప్ ను పరిశీలించి బాధితులను పరామర్శించడం జరిగింది. శనివారం జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు జిల్లా, రాష్ట్ర జనసేన నాయకులు గోకవరం మండలం వీరలంకపల్లి చేరుకుంటారు. అక్కడ నుండి ఘనంగా స్వాగతం పలుకుతూ బైక్ ర్యాలీగా బయలుదేరి పెంటపల్లి మీదుగా రంపయర్రంపాలెం గ్రామంలో జనం కోసం జనసేన 69వ రోజు కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుండి తిరుమలాయపాలెం చేరుకొని రోడ్డు ప్రమాదంలో మరణించిన మన జనసైనికుడు సారిపిరెడ్డి అంజి కుటుంబానికి 5 లక్షల రూపాయలు జనసేన ఇన్సూరెన్స్ చెక్కు అందజేసి, అనంతరం మల్లిసాల గ్రామంలో దళితవాడలో అగ్నిప్రమాదంలో కాలిపోయిన మూడు ఇండ్లను పరిశీలించి వారిని పరామర్శించి మూడు కుటుంబాలకు భర్తలు చనిపోవడం వల్ల వారి పిల్లలతో రోడ్డున పడ్డారు కావున జనసైనికుల ఆర్థిక సహకారంతో నిర్మించబోయే మూడు ఇళ్లకు కొబ్బరికాయ కొట్టటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసైనికులు పాల్గొనవలసిందిగా నాయకులు కోరడం జరిగింది.