నాదెండ్ల మనోహర్ మాట కాకినాడలో అందరి నోట

కాకినాడ సిటీ: జనసేన పార్టీ ఇన్చార్జి మరియు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్ మాట కాకినాడలో అందరి నోట అనే కార్యక్రమాన్ని స్థానిక జగన్నాధపురం 15 డివిజన్లో ఏటిమొగ ప్రాంతంలో రచ్చా ధనలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప తెలివితేటలతో పధకాలని ప్రకటిస్తారనీ అది చూసి మొదట్లో ఇదివరకు ప్రజలు హబ్బో ఇంకో కొత్త పధకం పేద ప్రజలకు అమలు చేయబోతున్నారని ఆశపడేవారనీ, కొంతకాలం గడిచాకా అసలు విషయం అర్ధమైందనీ, ప్రకటిస్తున్న పధకాలు తన సొంత పేపరులో ప్రకటనలకి, చేతివాటానికి తప్ప ప్రజలకు కాదన్నది తెలుసుకున్నారన్నారు. ఉదాహరణకి గత పదిరోజులలో ఆడుదాం ఆంధ్రా అన్నారనీ, ప్రకటనలు పేపరులో గుప్పించారు, వివిధ క్రీడా పరికరాలపై జగన్మోహన్ రెడ్డి ఫొటోతో స్టిక్కర్లు వగైరా వగైరా అన్నీ పడ్డాయి రెండురోజులు గడిస్తే ఆడుదాం ఆంధ్రా ఊసు తెలియదనీ, దాని పేరుతో నిధులు హాంఫట్ అన్నారు. ఏపధకాన్ని పోస్టుమార్టం చేసినా అందులో అవినీతి బయటపడుతోందన్నది ప్రజలకు అర్ధమవుతోందనీ, ఇలాంటి వ్యక్తినా మన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది అని నేడు ప్రజలు చింతించే పరిస్థితికి రావడం ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యమన్నారు. తొందరలో ఈ వై.సి.పి ప్రభుత్వాన్ని ఇంటికి పంపవలసినదిగా ప్రజలను కోరుతూ జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి కూటమికి మద్దతు ఇవ్వవలసినదిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రచ్చా ధనలక్ష్మితో బాటు సతీష్, సుబ్బారావు, అజయ్, ప్రసాద్, పోసలయ్య, రత్నం, బాబు తదితరులు పాల్గొన్నారు.