మిర్చి పొలాలను పరిశీలించిన నాదెండ్ల నాగేశ్వరరావు

సత్తెనపల్లి నియోజకవర్గం, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి రూరల్ మండలం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ బాధ్యులు బొర్రా వెంకట అప్పారావు ఆదేశాల మేరకు మీచౌంగ్ తుఫాన్ వలన సత్తెనపల్లి మండలంలో కట్టమురు, రెంటపాళ్ళ గ్రామంలో దెబ్బ తిన్న మిర్చి పొలాలను జనసేన పార్టీ సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు గురువారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ఎవరూ అధైర్యపడవద్దు జనసేన పార్టీ తరుఫున రైతుల పక్షాన నిలబడి రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. పంట నష్టం జరిగి రైతులు తీవ్ర ఆవేదనతో ఉంటే వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం అని నాగేశ్వరరావు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పంట నష్టపోయిన రైతులకు న్యాయం చెయ్యకపోతే జనసేన పార్టీ తరుఫున ప్రజా ఉద్యమం చేస్తామని జనసేన పార్టీ సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమములో జనసేన పార్టీ పల్నాడు జిల్లా ఎస్సీ నాయకులు చిలకా పూర్ణ, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, జనసేన నాయకులు మాజీ సర్పంచ్ చిలక సత్యం, రెంటపల్లి జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు మారిశెట్టి శ్రీనివాసరావు, జనసేన నాయకులు ఊటుకూరు ఫణి తదితరులు జనసైనికులు పాల్గొన్నారు.