నాగ్ వైల్డ్ డాగ్ ఓటీటీలో..

‘కింగ్’ నాగార్జున నటిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. నాగ్ టైటిల్‌ రోల్‌లో, ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారి ఏసీపీ విజయ్‌ వర్మ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయామీ ఖేర్ కీలక పాత్ర పోషించింది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పై అందరిలో క్యూరియాసిటీ ఏర్పడింది. కులుమనాలి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని.. అక్కడ వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేసిన తర్వాత ఈ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. కులుమనాలి షెడ్యూల్ తో షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

ఈ సినిమా సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాలి అయితే… కరోనా కారణంగా ఆగింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… వైల్డ్ డాగ్ మూవీ ని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి .ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.

ఈ చిత్ర నిర్మాతలు ఈ ఓటీటీ సంస్థతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. త్వరలోనే రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే… నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కావచ్చు. ఇదే కనుక జరిగితే….ఓటీటీలో మూవీ రిలీజ్ చేసిన సీనియర్ హీరోగా మరో రికార్డ్ నాగ్ సొంతం అవుతుంది.