రాజకీయ శిక్షణా తరగతుల ఏర్పాట్లను పర్యవేక్షించిన నాగబాబు

జూలై 2న మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరగనున్న “జనసేన క్రియాశీలక వీరమహిళల రాజకీయ శిక్షణా తరగతులు” ఏర్పాట్లను జనసేన పార్టీ పీ.ఏ.సీ. సభ్యులు కొణిదెల నాగబాబు గారు శుక్రవారం పర్యవేక్షించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల వీర మహిళలకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రారంభించి ప్రసంగించనున్నారు. వీర మహిళలకు రాజకీయ వ్యవహారాల్లో గౌరవ ప్రదమైన స్థానం అందించాలని ఆకాంక్షించే పవన్ కల్యాణ్ వీరమహిళలతో ప్రారంభిస్తున్న రాజకీయ శిక్షణా తరగతులను వినియోగించుకొని విజయవంతం చేయాలని వీర మహిళలకు నాగబాబు పిలుపునిచ్చారు.