స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకల్లో నక్కపల్లి జనసేన
పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలంలో అమృతోత్సవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నక్కపల్లి మండలంలో ఉన్న అన్ని పంచాయతీల జనసైనికుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన జండా వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి మాట్లాడుతూ.. మన స్వాతంత్ర్య సమరయోధులు మనకు స్వాతంత్ర్యం ఇవ్వడానికి లెక్కలేనన్ని బాధలు పడ్డారు, వారి త్యాగాలను మనందరం ఎప్పటికీ మరువకూడదు అని చెప్తూ స్వాతంత్ర్య పోరాటాలను స్మరించుకుంటూ, దేశ మరియు రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జండా వందన కార్యక్రమం ఏర్పాటు చేసిన నక్కపల్లి మండల జనసైనికులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.