నలిశెట్టి శ్రీధర్ సొంత నిధులతో కాలువ పూడికతీతకు శ్రీకారం

ఆత్మకూరు: జనసేనాని పవన్ కళ్యాణ్ బాటలోనే, ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్, సంగం మండలం, అనసూయ నగర్ లో తన సొంత నిధులతో కాలవకు పూడిక తీతకు శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళితే సంగం మండలం అనసూయ నగర్ లో ఇళ్ల మధ్యన మురికి నీరు చేరి దుర్గంధ భరితంగా మరియు దోమల ఆవాస కేంద్రంగా తయారై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించమని స్థానిక జనసేన నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ స్థానిక ఎంపీడీవో నుంచి జిల్లా కలెక్టర్ వరకు అనేక వినతి పత్రములు ఇచ్చినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. సోమవారం దీనిపై స్పందించిన శ్రీధర్ తన సొంత నిధులతో ఈ కాలువ పూడికతీతకు శ్రీకారం చుట్టి ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ నలిసిటీ శ్రీధర్ తో కలిసి స్థానిక నాయకులు అట్టిపాటి కృష్ణ మోహన్, సీనయ్య, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, నరసయ్య, భాస్కర్, శీను, సుబ్బయ్య, వెంకటేష్, రవి, ఆనందరావు తదితరులు పాల్గొనడం జరిగింది.