అంబేద్కర్ మెమోరియల్ జిల్లా చెడుగుడు పోటీలను ప్రారంభించిన నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు, సంగం మండలం, మక్తాపురం గ్రామపంచాయతీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ జిల్లా చెడుగుడు పోటీలను జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నల్లిశెట్టి శ్రీధర్ ప్రారంభించడం జరిగింది. ఈ పోటీలలో మొదటి బహుమతి 15,116/- రూపాయలు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నల్లిశెట్టి శ్రీధర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్, సంగం మండల నాయకులు షేక్ నాయక్ భాషా, ప్రదీప్, సంగం మండల నాయకులు ఆనంద్ రావు, సంగం మండల నాయకులు కృష్ణ మోహన్, తిరుమలేష్, వెంకటేష్, సాయిచంద్, పార్వతీష్, సాయి, చందు, నందా, హేమసాగర్ తదితరులు పాల్గొన్నారు.