డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించిన నల్లజర్ల జనసేన

గోపాలపురం: డా.బి.ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా నల్లజర్ల మండలం, అవపాడు గ్రామంలో మంగళవారం నల్లజర్ల మండల జనసేన ఆధ్వర్యంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అచ్చుత సత్యనారాయణ అధ్యక్షతన అంబేద్కర్ కు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అచ్చుత సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలి అని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోని ప్రభుత్వాన్ని ఎన్నుకొనే విధంగా ప్రజల చేతుల్లోకి ఓటు హక్కు అనే ఆయుధాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. అలాగే ప్రజలు అంబేద్కర్ మనకు ఇచ్చిన ఓటు హక్కును రాక్షస పరిపాలిపాలనకు స్వస్తిచెప్పి ప్రజా పరిపాలనకు మార్గాలు వెయ్యాలి అని కోరుతూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు అని ప్రజలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నల్లజర్ల మండల నాయకులు, జిల్లా చిరంజీవి యువత సహాయ కార్యదర్శి, జనసేన నాయకులు రుద్రా శ్రీనివాస్, జిల్లా కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు కవులూరు సత్తిబాబు, ఈర్లపాటి జయ, అచ్చుత పెదకాపు, సర్పంచ్ ఉనమట్ల రమేష్ బాబు, కూనపులి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.