యండమూరు గ్రామ రైతులకు భరోసా ఇచ్చిన పంతం నానాజీ

కాకినాడ రూరల్: కరప మండలంలో పర్యటిస్తున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ గారిని యండమూరు గ్రామంలో స్థానిక రైతులు కలిసి.. వారు పడుతున్న ఇబ్బందులు లిఖిత పూర్వకంగా తెలియచేసి, మా బాధ అధికారులకు తెలియపరచండి అని కోరారు.. నీరు సరిగా రాకపోవడం వలన పంట పూర్తిగా దెబ్బతిని నష్టపోయమని వారి బాధను తెలియచేసారు. వారి సమస్యలను విని పై అధికారులతో మాట్లాడతామని ఈ సందర్భంగా పంతం నానాజీ రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది.