జనసైనికుడు చక్రరావుకు పంతం నానాజీ నివాళి

కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో ఇటీవల మరణించిన జనసైనికుడు పోసిన చక్రరావు కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ పరామర్శించారు. చక్రరావు చిత్రపటానికి పుష్పాలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నున్న గణేష్ నాయుడు, కర్ని శ్రీనివాస్, శివ, రాము తదితరులు పాల్గొన్నారు.