వాల్మీకి జయంతి సందర్భంగా నివాళులర్పించిన నంద్యాల జనసేన

నంద్యాల, వాల్మీకి జయంతి సందర్భంగా శనివారం నంద్యాల జనసేన పార్టీ తరఫున నంద్యాలలో పలుచోట్ల ఉన్న వాల్మీకి ఆలయాల నందు పూజా కార్యక్రమాలలో నంద్యాల జనసేన పార్టీ నాయకులు చందు, సుందర్ లు నంద్యాల టీడీపి ఇంచార్జ్ భూమా బ్రహ్మానంద రెడ్డితో పాటు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలలో దేవనగర్ వాల్మీకి ఆలయం నందు పూజా కార్యక్రమాలలో దేవనగర్ వాల్మీకి నాయకులు, టీడీపీ ఇంచార్జ్ దస్తగిరి, దేవనగర్ కౌన్సిలర్ జైనబి దంపతులు, టీడీపి కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.