అబ్దుల్ కలాంకు ఘన నివాళులు అర్పించిన నరసరావుపేట జనసేన

నరసరావుపేట నియోజకవర్గం: జనసేన పార్టీ కార్యాలయంలో.. బుధవారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఏడవ వర్ధంతి సందర్బంగా సయ్యద్ జానీ నాయకత్వంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం గారు తమిళనాడులోని నిరుపేద కుటుంబాలలో జన్మించి. వీధిలైట్ల కింద చదువుకొని రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని.. అంతరిక్ష పరిశోధనలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టారని. విద్యార్థులపై అత్యంత ప్రేమను చూపించే అబ్దుల్ కలాం గారు.. విద్యార్థుల సెమినార్ లోనే మరణించటం.. విద్యపై ఆయనకున్న మక్కువను చాటిందని అన్నారు. దేశ రక్షణకు ఆయన పురశోధనలు ఎంతగానో తోడ్పడ్డాయని. నేటి పౌరులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జీవీఎస్ ప్రసాద్ జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనంద్ బాబు, కృష్ణం శెట్టి గోవింద్, అచ్చుల సాంబశివరావు, అద్రుఫ్ ఆర్ కే యాదవ్, బెల్లంకొండ అనిల్, షేక్ నాగుల్ మేరా, రామారావు, గుప్తా శ్రీకాంత్, విజయ్, మిరియాల సోము,.ఎస్ డి. గౌస్, లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు. తదితరులు పాల్గొన్నారు.