వర్షాలకు నీట మునిగిన వేరుశనగ పంట పొలాలను పరిశీలించిన నెల్లూరు జనసేనపార్టీ అధ్యక్షులు

సంక్రాంతి కి రైతులకు అండగా ఉండాలని జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు అదేవిధంగా నెల్లూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నాయకత్వం లో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలోని విడవలూరు మండలం గౌరీపురం గ్రామంలో అకాల వర్షాలకు నీట మునిగిన వేరుశనగ పంట పొలాలను పరిశీలించి , పంట వేసిన రైతులను కలుసుకుని జరిగిన నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేవిధంగా పోరాటం చేసి రైతులను ఆదుకుంటామని కోవూరు నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు శ్రీ చప్పిడి శ్రీనివాసులు రెడ్డి మరియు విడవలూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ కమతం శ్రీనాధ్ యాదవ్ ఆధ్వర్యంలో రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేనపార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ మున్వర్ బాషా , కోవూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ షేక్ అల్తాఫ్ , కోవూరు మండల జనసేనపార్టీ నాయకులు శ్రీ సాయి కృష్ణ , విడవలూరు మండల జనసేనపార్టీ నాయకులు శ్రీ కడియాల రాము , శివ కుమార్, రాజా , శ్రీకాంత్ , రైతులు , జనసైనికులు , గ్రామస్థులు పాల్గొన్నారు.