నేతాజీ: రియల్ ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ వీరఘట్టం మండలం పాపమ్మపేట గ్రామ జనసేన నాయుకులు, జనసైనికులు పెద్దలు యువతతో మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా వారితో మాట్లాడటం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రానికై ఏకంగా ఒక ఆర్మీ సైన్యాన్ని తయారు చేసిన గొప్ప ధీరుడు మన సుభాష్ గారు. ప్రపంచంలో జయంతి తప్ప వర్ధంతి లేని అమరవీరుడు మన బోస్ గారు. స్వతంత్ర సమరయోధుల్లో నాకు అత్యంత ఇష్టమైన యోధుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఇలా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది. కేవలం భరతమాత స్వేచ్చ కోసం అనుక్షణం పరి తపించి ఒకే ఒక్క పిలుపుతో దేశంలోని ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని రగిలించి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టించిన దీరుడు మన నేతాజీ ఒక్క మాటలో చెప్పాలి అంటే రియల్ ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. భారత స్వాతంత్య్ర సమరయోధులు ఆజాద్ హింద్ ఫౌజ్‌‌ స్థాపనతో బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించి స్వాతంత్య్ర సంగ్రామాన్ని మరో మలుపు తిప్పిన యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన దేశానికి అందించిన సేవలు అపూర్వం అని అలానే మీ గ్రామంలో ఉండే యువత గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలి అని మరియు మీ వేక్తిగతం మీరు అందరూ ఉన్నతమైన స్థానంలో రాణించాలి అని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో రఘమండల గణేష్, గోళీ అనీల్, లుకాలపు కామేష్, రఘమండల జగన్, కోవగానా చిన్నారావు, ఎర్నేన సాయి, గొర్లె పవన్, సంగాపు జీవరత్నం తదితరులు పాల్గొన్నారు.