జనసేన పార్టి జిల్లా ఆఫీసులో ఘనంగా కొత్త సంవత్సరం వేడుకలు

గుంటూరు జిల్లా జనసేన పార్టి ఆఫీసులో శనివారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టి జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు నూతన సంవత్సర కేకును కట్ చేసి జనసేన నాయకులు కార్యకర్తలు, వీరమహిళలకు స్వీట్లు పంచి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికినారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలు రానున్న రోజుల్లో కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి బిట్రగుంట మల్లికా, అడపా మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్శులు కొప్పుల కిరణ్, ఉప్పు వెంకట రత్తయ్య, నారాదాసు ప్రసాద్, కార్యదర్శి నక్కలు వంశీ, చింతా రేణుకా రాజు, నేరేళ్ళ సురేష్, ఆళ్ళ హరి, శిఖా బాలు, పావులూరి కోటేశ్వరరావు, కోడూరు కిషోర్, శేఖర్, గంగారాజు, వీరమహిళలు పాకనాటి రమాదేవి, ప్రియారాణి తదితరులు పాల్గొన్నారు.