నిడదవోలు జనసేనలో చేరికలు

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం తిమ్మారాజుపాలెం గ్రామంలో శ్రీ కోటసత్తెమ్మ ఫంక్షన్ హల్ నందు నిడదవోలు నియోజకవర్గ మహాసేన నాయకులు, నిడదవోలు సమస్యలపై ప్రశ్నించే గొంతు, తాడిమల్ల గ్రామం నుండి దొడ్డిగర్ల ప్రకాష్ మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో జనసైనికుల సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరిని జనసేన నాయకులు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, రాష్ట్ర కార్యదర్శి ప్రియ సౌజన్య, జిల్లా సంయుక్త కార్యదర్శులు పాల సత్య వీరాస్వామి, కాకర్ల నాని, పట్టణ నాయకులు రంగా రమేష్, పెండ్యాల ఎంపీటీసి వాకా ఇంద్రగౌడ్, మేడ పూర్ణచంద్రరావు, యడ్లపల్లి సత్తిబాబు, చింతపల్లి సర్వేశ్వరావు, తమ్మిరెడ్డి దుర్గారావు, కర్రి వినోద్, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.