గంధం శెట్టి ఆధ్వర్యంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రైల్వేకోడూరు: జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రైల్వేకోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరపతి కోసం, పదవుల కోసం, స్వార్ధ చింతనతో జనసైనికులు పనిచేయరన్నారు. జనసేనకి జనాలకు మధ్యలో జనసైనికులు అనుసంధానకర్తలుగా ఉంటారని పేర్కొన్నారు.. పచ్చ మరియు నీలి మీడియాలలో వస్తున్న విష ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. జనసేన పార్టీ పుష్పక విమానం వంటిదని, కులమత ప్రాంత వర్గ విభేదాలకు జనసేన పార్టీలో స్థానం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మూడో ప్రత్యామ్నాయమే అసలైన ప్రత్యామ్నాయమని ప్రజలు గుర్తించాలని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలు సుఖసంతోషాలతో ఉండాలంటే జనసేన పార్టీని రానున్న 2024 ఎన్నికలలో గెలిపించాలని ప్రజలను కోరారు. తెలుగు రాష్ట్రాలలో మరియు దేశ విదేశాలలో జన సైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులకు, జనసేన శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శశి, సునీత, సంధ్య, ఎద్దల అనంతరాయలు, కొర్లగుంట గిరిధర్, సాయి దినేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.