నిమ్మలపాడు గ్రామస్తులకు అండగా ఉంటా: జనసేన మురళి

అనంతగిరి: అక్రమ మైనింగ్ విషయంలో అక్రమాలకు గురౌతున్న నిమ్మలపాడు గ్రామస్తులకు అండగా ఉంటానని జనసేన మురళి హామీ ఇచ్చారు. అక్రమ మైనింగ్ పై గళమెత్తిన నిమ్మలపాడు గ్రామస్తులు ఏపీఎండిసి వారిని ప్రశ్నిస్తూ నిమ్మలపాడు, రాలగరువు, కరకవలస గ్రామ ప్రజలు స్థానికులమైన మాకు న్యాయం చేయని ఏపీఎండిసి మా గ్రామానికి రావదద్దంటూ ఏపీఎండిసి గో బ్యాక్!, కుంభ రవి బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఏపీఎండిసి ఉద్యోగస్తులను గ్రామము నుండి పంపించినారు. మా భూములను, మా జీవితాలను నాశనం చేసే కుంభ రవి బాబు, ఏపీఎండీసీ సంస్థ గో బ్యాక్ అంటూ గ్రామము నుండి వారిని పంపించినారు. గిరిజనులకు మోసము, ద్రోహము చేసే ఏపీఎండిసి మాకు వద్దని జనసేన మురళి కి ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ మైనింగ్ అక్రమాలకు గురౌతున్న నిమ్మలపాడు గ్రామస్తులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.