మైనింగ్ అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు: చిట్టం మురళి

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం, అనంతగిరి మండలం వాలసి పంచాయతీ రాళ్ళగడ మరియు నిమ్మలపాడు ప్రాంతంలో జనసేన నాయకులు పర్యటించారు. జనసేన పర్యటనలో మైనింగ్ విషయంపై గ్రామ ప్రజలను ప్రశ్నించగా గ్రామస్తులు చెప్పిన జవాబు టన్నుకు 300 రూపాయలు చెల్లించాలి.. మాకు విద్య, వైద్య సౌకర్యం కల్పించాలి. సుమారు 80 ఇల్లు కట్టి ఇవ్వాలి.. మా గ్రామంలో మంచినీటి సదుపాయం కల్పించాలి.. పంచాయతీ మొత్తానికి (ఏపీఎండీసీ) వారు 100 ఉద్యోగాలివ్వాలి అని గ్రామస్తులు కోరారు. ఈ విషయంపై నియోజకవర్గ సమన్వయ కమిటీ నాయకులు నవీన్ కుమార్, ప్రవీణ్ లు మాట్లాడుతూ.. 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న పీసా చట్టాన్ని మరియు సమత తీర్పుకు వ్యతిరేకంగా మైనింగ్ మాఫియా చేస్తున్నారు. సమత తీర్పు ప్రకారంగా 5వ షెడ్యూల్ ప్రకారముగా (ఏపీఎండీసీ) వారు అక్కడున్న ప్రజలను మరియు మౌలిక ఆర్థిక విషయాలను వ్యవసాయం చేసి జీవించిన వారిని ఏ మాత్రం నష్టపరిహారం గానీ సమత జడ్జిమెంట్ తీర్పు వచ్చిన విధంగా అక్కడున్న మైనింగ్ జరగడం లేదు వీరికి న్యాయం చేసి.. గిరిజన చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు ఎమ్మెల్యే, ఎంపీలు, ప్రజాప్రతినిధుల మీద ఉన్నది. అధికార పార్టీలో ఉండి గొప్పలు చెప్పుకోవడం కాదు వాస్తవాలు తెలుసుకొని భారత రాజ్యాంగం పరంగా 5వ షెడ్యూల్లో ఉన్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత వీరిపై ఉన్నది అని జనసేన పార్టీ తెలియజేస్తుంది. 5వ షెడ్యూల్లో ఉన్న హక్కులను కాలరాస్తున్న (ఏపీఎండీసీ) మరియు దాని వెనక ఉన్న మైనింగ్ మాఫియా వారిపై పోరాటానికి జనసేన పార్టీ సిద్ధముగా ఉన్నది. గిరిజన హక్కులను కాపాడలేని ఎమ్మెల్యే, ఎంపీలు, ఎస్టీ కమిషన్ చైర్మన్ గిరిజనుల పక్షాన ఉన్నారా..? లేదా మైనింగ్ మాఫియా వైపు ఉన్నరా..?.. సమాధానం చెప్పవలసిన బాధ్యత వారిపై ఉన్నది. సమాధానం చెప్పండి.. లేని ఎడల గిరిజన పక్షాన పోరాడడానికి జనసేన పార్టీ ఎప్పుడు వెనకడుగువెయ్యదని తెలియజేస్తున్నాము. ఈ మైనింగ్ మాఫియాను ముందుకు తీసుకు వచ్చి నడిపిస్తున్న వారు ఎంతటి వారైనా సరే జనసేన పార్టీ వారిని నిలదీస్తామని వాళ్లు తెలిపారు. అలాగే జనసేన పార్టీ మండల అధ్యక్షులు. సిహెచ్ మురళి మాట్లాడుతూ.. 112.. సంపూర్ణ నిషేధం ఏది లేనిపక్షంలో 298. అధికరణం కింద 5వ షెడ్యూల్ ప్రాంతంలో పర్యావరణ పునరుద్ధరణ నిర్వాణ పరిశ్రమ ఉండే ప్రాంతంలో రోడ్డు కమ్యూనికేషన్ సదుపాయాలు మరియు గిరిజనులకు శుభ్రమైన నీటి సరఫరా.. ప్రాథమిక, సెకండరీ విద్యను ఉచితంగా అందించేందుకు పాఠశాలల ఏర్పాట్లు.. గిరిజనులకు ఉద్యోగావకాశాలను పెంచేందుకు వృత్తి శిక్షణకు సదుపాయాలు. తమ సంస్థ/ ఫ్యాక్టరీలో గిరిజనులకు వారి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు.. షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనులకు ఉచితమైన వైద్య సదుపాయం, చికిత్స అందించేందుకు ఆస్పత్రులు, శిబిరాలు ఏర్పాటు చెయ్యాలి. పరిశుద్ధ నిర్వహణ షెడ్యూల్ ప్రాంతంలోని నిర్దిష్ట ప్రదేశాలలో గిరిజనులకు గృహ నిర్వహణం ఆయా సంస్థ/ పరిశ్రమల వార్షిక బడ్జెట్ లో పై పనులకు అయ్యే వ్యయం అంతర్భాగంగా ఉండాలి అని అధ్యక్షులు సిహెచ్ మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండలం వీరమహిళ రత్న ప్రియ మండల నాయకులు మంగళపంచాయతీ మాజీ సర్పంచ్ ధర్మన్న, ఎస్ తిరుపతి, సుబ్బరాజు, చంపి సోమన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.