సంకల్పిత వారాహి యాత్ర దిగ్విజయార్థం నృసింహ సుదర్శన హోమం

ధర్మపురి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 14 నుండి ప్రారంభించే వారాహి యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతూ.. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతమై, ధర్మపురి లక్ష్మి నృసింహ స్వామి ఆశీస్సులతో శిగ్రమే పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాధికారం సిద్ధించి ధర్మబద్ధంగా, ప్రజారంజక పరిపాలన అందించాలని. అదేవిధంగా తెలంగాణలో జనసేన పార్టీ బలమైన శక్తిగా ఎదగాలని దృఢ సంకల్పంతో ధర్మపురి నృసింహ స్వామి మందిరంలో సుదర్శన హోమం ధర్మపురి జనసేన పక్షాన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మపురి జనసేన ముఖ్యనాయకులు ఒడ్డెటి కరుణాకర్, వినయ్ సంగణభట్ల, వంశీ, లక్ష్మణ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.