పవన్, వారాహి పేరిట గురాన అయ్యలు ప్రత్యేక పూజలు

విజయనగరం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జూన్ 14 నుంచి చేపట్టనున్న వారాహి యాత్ర విజయవంతం కావాలని కోరుతూ విజయనగరం జిల్లా జనసేన నేత గురాన అయ్యలు మంగళవారం పైడిమాంబ దేవాలయంలో పవన్‌కల్యాణ్‌ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు చేసిన తర్వాత 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పుండ్రోతు రవీంద్ర, పిడుగు సతీష్, ఎంటి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మతా గాయత్రీ, గంట్లన పుష్ప, దంతులూరి రామచంద్ర రాజు, వంక నరసింగరావు, త్యాడ రామకృష్ణ రావు, ఏర్ణగుల చక్రవర్తి, లోపింటి కళ్యాణ్, మండల శ్రీను, పవన్ కుమార్, బాబు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.