అగ్ని ప్రమాద బాధితులకు మనోధైర్యాన్నిచ్చిన నూజివీడు జనసేన

నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చీపురుగూడెం గ్రామంలో అబ్బ దాసరి కిరణ్ అనే కుటుంబానికి సంబంధించిన ఇల్లు ప్రమాదవశాత్తూ కాలి కుటుంబం మొత్తం సర్వస్వం కోల్పోవడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, చాట్రాయి మండల అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ, ఉపాధ్యక్షులు తుమ్మల జగన్, తుమ్మలపల్లి పాపారావు, మండల కార్యదర్శి మొలుగుమాటి భాస్కరరావు మరియు జనసైనికులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం చేయడం జరిగింది. ఇల్లు పూర్తిగా కాలిపోయి చంటి బిడ్డలతో ఇంటి పక్కన పరదాలు కట్టుకొని ఉన్న ఆ కుటుంబాన్ని మరింత ఆదుకోవాలనే సదుద్దేశంతో వారికి ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన రేకులు మరియు స్తంభాలు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మంగళవారం సాయంత్రం వారికి ఆ సామాగ్రి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.