ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో విశాఖ తూర్పు నియోజకవర్గం, 15వ వార్డు జనసేన నాయకులు పచ్చితాల సాయిబాబా ఆధ్వర్యంలో మే 20వ తారీకున ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా 53 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా.. శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి రంగా గారి జయంతి పురస్కరించుకొని, మరియు మొదటి విడత వారాహి విజయ యాత్ర విజయవంతంగా పూర్తయిన సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు జరిపి అనంతరం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనంలోకి జనసేన అనే నినాదముతో వెంకోజీ పాలెం సర్కిల్ నందు ఏర్పాటుచేసిన జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి విశిష్టంగా విశాఖపట్నం జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు అందరూ వచ్చి విజయవంతంగా ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా వైసిపి నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీ జెండా, టిడిపి జెండా మధ్యలో జనసేన జెండా కట్టిన విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం 15వ వార్డు జనసేన నాయకులు పచ్చతాల సాయిబాబా కి హృదయపూర్వక అభినందనలు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేను ఎవరికీ భయపడను నా ధైర్యం పవన్ కళ్యాణ్ ఆయన చెప్పిన పని నేను చేస్తా జనంలోకి జనసేన జనసేన పార్టీ ఉన్నంతవరకు నేను జనంలోనే ఉంటా పవన్ కళ్యాణ్ వెంట నడుస్తా జెండా ఆవిష్కరణ ఘనంగా జరిపిన ప్రతి ఒక్కరికి, జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు నా అభినందనలు. ఇలాంటి కార్యక్రమంలో ప్రతి దగ్గర తూర్పు నియోజకవర్గం లో ప్రతి వాడ వాడ జరిగేలా ప్రతి ఇంటి పైన జనసేన జెండా ఉండేలా 2024లో జనసేన పార్టీ అధికారం కోసం నేను ఇంకా ఇంకా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ కోసం పని చేస్తూనే ఉంటా జనసేన పార్టీలోనే ఉంటా అని ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది.