జనసేనకు ఒక్క చాన్స్ కార్యక్రమంలో వైసీపీ తీరును ఎండ గట్టిన మాకినీడి

  • ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల మీద మాట్లాడానికి పిల్లి.. విమర్శలకు మాత్రం పులి
  • అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల తీరును ఎండ గట్టిన జనసేన ఫైర్ బ్రాండ్

కాకినాడ జిల్లా, పిఠాపురం వైసీపిపార్టీ విమర్శలే పనిగా మూడు సంవత్సరాలు కాలయాసన చేసి ప్రజాసమస్యలు మాత్రం గాలికి వదిలేసీందని. పాలనగాడితప్పుతున్నా.. గాడిద గాండ్రింపులతో పాలావిధానం సాగుతుంది గాని ప్రజలకు వరిగేదిలేదని మాకినీడి శేషుకుమారి అన్నారు. జనసేనకు ఒక్క చాన్స్ కార్యక్రమంలో స్థానిక జగ్గయ్య చెరువులో పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జి మాకినీడి శేషుకుమారి ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకుని ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. మేము చూసినంతటిలో ఎక్కడా కూడా డ్రైనేజీ గాని, రోడ్లు గాని, మంచి నీటి సదుపాయం గాని సరిగ్గా లేవని ఇక్కడ ప్రజలుపట్టణ పరిది అని మరచి పోయి సౌకర్యాలు లేని ఏజన్సీ ప్రాంతంలా బాదపడుతున్నారని ప్రజల ఇబ్బందులు స్పష్టతనిచ్చారు. ఏరుదాటాక తెప్పను వదిలేసి నట్లుగా ప్రజలతో ఓట్లు వేయించుకుని ప్రజలకు సౌకర్యాలు కల్ఫించక పోవడం దారుణమ్మన్నారు. ఒక్క చాన్స్ కార్యక్రమం ద్వారా జనసేనాకి బ్రహ్మరథం పడుతున్నారని, జనసేన అధికారంలోకీ వస్తే మొదట పని జగ్గయ్య చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని, ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల మీద మాట్లాడానికి పిల్లి.. విమర్శలకు మాత్రం పులి అని ఆమె ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, గోపు సురేష్, బుర్రా సురేష్, మేళం బాబి, కసిరెడ్డి నాగేశ్వరరావు, కంద సోమరాజు, వినయ్, మణికంఠ, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.