జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ పోస్టర్ ఆవిష్కరణలో భాగంగా రాజమండ్రి సిటీలో పోస్టర్ ఆవిష్కరించిన అనుశ్రీ

  • నియోజకవర్గాల వారీగా “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” జనంలోకి జనసేన పోస్టర్ల పంపిణీ కార్యక్రమం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి సిటీ, “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసును మరియు జనసేన అధినేత చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలలోనికి బలంగా తీసుకెళ్ళేందుకు రూపొందించిన జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గా జనసేన సింబల్ గాజు గ్లాసుతో కూడిన 15000 పోస్టర్లను ప్రచురించి కొన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల ఇంచార్జుల చేతుల మీదుగా పోస్టర్లను ఆవిష్కరించే కార్యక్రమంలో భాగంగా గురువారం జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ వారి ఆఫీసులో “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” రూపొందించిన 3 రకాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం అనుశ్రీ సత్యనారాయణ శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయలతో భేటి అయ్యి జనసేనను బలోపేతం చేసేందుకు మరియు శతఘి న్యూస్ ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” జనసేనను బలోపేతం చేసేందుకు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకి చేరువ చేసేందుకు చేస్తున్న కార్యక్రమాల గురించి అనుశ్రీకి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” మరియు శతఘ్ని న్యూస్ పార్టీకి చేస్తున్న సేవలను కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ గెడ్డం నాగరాజు, ప్రధాన కార్యదర్శులు నల్లంశెట్టి వీరబాబు, పైడిరాజు, కార్యదర్శులు అల్లటి రాజు, గుణ్ణం శ్యాంసుందర్, జనసేన పార్టీ యువ నాయకులు బయ్యపునీడి సూర్య, మొండ్రేటి ప్రసాద్, విక్టరీ వాసు నర్సిపూడి రాంబాబు,మరియు శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయల పాల్గొనడం జరిగింది.