ఒనుములమ్మ తల్లి అమ్మవారి అన్నసమారాధనలో పాల్గొన్న బత్తుల

రాజానగరం, దివాన్ చెరువు గ్రామంలో సాకేత్ నగర్లో ఉన్న ఒనుములమ్మ తల్లి అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్ధప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆకాంక్షించడం జరిగింది. ఈ సందర్బంగా ఆలయ కమిటీ వారికి ₹5000/- రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట యర్రంశెట్టి శ్రీను, నాగేశ్వరావు, అక్కిరెడ్డి వేణు, స్టాలిన్, ముక్కోటి గోపాలం, నల్లమల్ల సోమన్న, పోలరావు తదితరులు పాల్గొన్నారు.