ఎనిమిదో వార్డ్ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే మా లక్ష్యం

  • ఎన్నో సంవత్సరాలుగా నీళ్ళ కోసం పడిగాపులు కాస్తున్న ఎనిమిదో వార్డులోని దక్షిణ గడ్డ బజారు ప్రాంత ప్రజలకు కౌన్సిలర్ అంబటి సుధారాణి స్వామి చొరవతో తీరిన కష్టాలు.

గుంటూరు, ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అందిన వినతులు అన్నిటికీ ఒక్కొక్కటిగా పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తున్నామని ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న నీటి సమస్య పై ప్రధానంగా దృష్టి పెట్టామని అందులో భాగంగానే దక్షిణగడ్డ మహిళలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను కౌన్సిల్ సమావేశాల్లో ఏకరువు పెట్టి శాశ్వత పరిష్కారం చూపాలని పట్టు బట్టి మరీ బోర్ వెల్ ఏర్పాటుకు కృషి చేశామన్నారు. బోర్వెల్ ఏర్పాటు యొక్క ఆవశ్యకతను తెలియజేయగానే మా ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టిన నగర పంచాయతీ కమిషనర్ శ్రీవిద్య, చైర్మన్ లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇవే కాకుండా వార్డులో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని వాటిని కూడా కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించి త్వరితగతిన పరిష్కార మార్గం చూపేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికల్లో మాత్రమే రాజకీయం చేయాలని అనంతరం అభివృద్ధి ధ్యేయంగా పని చేయాలని ఆమె ఆకాంక్షించారు.