పాలకొండ జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళులు

పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున మంగళవారం డాక్టర్‌ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్బంగా వీరఘట్టం మండలం సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించటం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మంచి పరిపాలన రావాలి అన్న అంబేద్కర్ కలలు గన్న రాజ్యాంగ రాజ్యం రావాలి అంటే.. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుకూలంగా నడిచే నాయుకులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జనసేన క్రియాశీలసభ్యులైన బాబ్బాది పకిరు నాయుడు, (బిపి. నాయుడు) మత్స పుండరికం, వావిలపల్లి, భూషణ్, కర్నెన సాయి పవన్, దత్తి గోపాల్, దూసి ప్రణీత్, బొమ్మాళి వినోద్, మాచర్ల చందు, నడుకూరు గ్రామస్తలు లెంక గోవింద రావు, బబ్బాది రామూర్తి నాయుడు, సాదు జగన్నాధం, బీజేపీ, ఓబీసీ మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇంచార్జ్ గుణుపూర్ వెంకట్ నాయుడు, కోడి వాసు పాల్గొన్నారు.