ముత్తా శశిథర్ ఆధ్వర్యంలో మా ప్రాంతం – మా సచివాలయం – మన జనసేన

కాకినాడ సిటిలో జనసేన పార్టీ మా ప్రాంతం – మా సచివాలయం – మన జనసేన అనే నినాదంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా ముత్తా శశిథర్ ఆధ్వర్యంలో సోమవారం 8 ఏవ వార్డు సచివాలయం పరిధిలో డి. సూరిబాబు మరియు ఎన్.సతీష్ కుమార్ ల నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటూ పనులు లేక తీవ్ర ఆర్ధిక సమస్యలు ఎదుర్కుంటున్నామని, దానికితోడు నిత్యావసర సరుకులు విపరీతమైన ధరలు ఉన్నాయనీ వాపోయారు. ఇక కరెంటు చార్జీలు చెప్పనక్కర్లేదని గగ్గోలు పెట్టారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ సరైన దిశానిర్దేశం లేనివిధంగా పాలన చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ వై.సి.పి ప్రభుత్వ పాలన చూస్తే అర్ధమవుతొందన్నారు. ఈ వై.సి.పి ప్రభుత్వం పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందనీ పాలించే అర్హత కోల్పోయిందన్నారు. యీ వర్గ ప్రజలను చూసినా ఈ ప్రభుత్వ పాలనలో నిస్తేజంగా ఉన్నారనీ, ఇక యువత చూస్తే నిర్వీర్యం ఐపోతున్నారనీ ఇది ఆరోగ్యకరమైన సమాజానికి మంచిది కాదని అన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో ఈ వై.సి.పి ప్రభుత్వ పాలనపై ప్రజల తరపున అలుపులేని పోరాటాన్ని చేస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.