రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఎన్ డీ ఏ ప్రభుత్వం రావాలి

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం పాటూరు పంచాయతి కుమ్మరపల్లె గ్రామంలో రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు నివాసానికి ఎన్డీఏ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే మరియు కూటమి నాయకులు, సభ్యులు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా విందును ఏర్పాటు చేసిన యల్లటూరు శ్రీనివాసరాజు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రం మరియు ప్రజలు బాగుండాలంటే ప్రస్తుత రాక్షస పాలన నుండి విముక్తి కలగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు టి.డి.పి రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు గారు, రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం గారు వీరు మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పటికే అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని కేవలం సంక్షేమమే ముసుగులో రాష్ట్రం అప్పులు పాలు అయిందని ఇటువంటి దౌర్భాగ్య పాలన పోయి సుపరిపాలన రావాలంటే భవిష్యత్తులో రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రులు కావాలని వారు ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొంది కూటమి ప్రభుత్వం రావడం తధ్యమని వారు హితవు పలికారు.