పాడేరు జనసేన నాయకులకు ఘన సన్మానం

అల్లూరిసీతారామరాజు జిల్లా, పాడేరు జనసేన పార్టీ రూరల్ జిల్లా పాడేరు, అరకు నియోజకవర్గాల నుంచి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులుగా ఎన్నికైన నాయకులకు సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికులు సమక్షంలో అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపురు గంగులయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా డా. గంగులయ్య మాట్లాడుతూ.. జిల్లా ప్రధాన బాధ్యతలు స్వీకరించిన నాయకులకు పార్టి బలోపేతానికి, నిర్మాణానికి తగిన బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుందని జనసేనాని సూచించిన మార్గదర్శకాలే పరమావధిగా శిత్తశుద్దితో పనిచేసి భవిష్యత్ లో గొప్పస్తాయికి ఎదగాలని జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గంలో గెలిచేందుకు అహర్నిశలు శ్రమించి ప్రజామోదం పొంది కచ్చితంగా పాడేరు నియోజకవర్గం జనసేనాని గిప్ట్ గా అందించాలన్నారు. ఈ సందర్బంగా పలువురు మండల నాయకులు జనసైనికులకు బవిష్యత్ కార్యాచరణపై దిశ నిర్దేశం చేశారు. అరకు జనసేన పార్టీ సమన్వయకర్త చెట్టి చిరంజీవి మాట్లాడుతూ పార్టీ పదవులు ఒక గొప్ప బాధ్యతగా భావించాలని జనసేనాని ఆశయాలు, లక్ష్యాలు గిరిజన ప్రాంతాల్లో విస్తరింపజేయడానికి మీ సమర్థత చూపించాల్సిన సమయమిదేనని అందుకు అందరూ సర్వదా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రూరల్ జిల్లా పాడేరు నియోజకవర్గ స్థాయిలోను ఉపాధ్యక్షులుగా శ్రీమతి కిట్లంగి పద్మ, కార్యదర్శి, ఉల్లి సీతారామ్, సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్, అలాగే అరకు నియోజక వర్గం నుంచి కార్యదర్శిగా బంగరు రాందాస్, సంయుక్త కార్యదర్శిగా కొన్నేడి లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైన విషయం తెలిసిందే.