పాడేరు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

  • ఐదు వందల బైకులతో బారి ర్యాలీ నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు

అల్లూరిసీతారామరాజు జిల్లా, పాడేరు జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు అధ్యక్షులుగా ఎన్నికైన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ప్రమాణస్వీకారం చేయించారు. పాడేరు జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి పాడేరు పురవీధుల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ జనసైనికులతో పాడేరు వీధుల్లో జనసేన నినాదం మారు మ్రోగిందని చెప్పాలి. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ.. కచ్చితంగా అల్లూరీ జిల్లా నుంచి జనసేన పార్టీ పోటీలో ఉంటుందని మీరంతా కష్టపడి పనిచేసి మీ ఆలోచన విధానాన్ని గిరిజన ప్రజలకు తెలియజేస్తూనే వారికి వాస్తవ రాజకీయాలపై పవన్ కళ్యాన్ ఆలోచన అవసరాన్ని తెలియజేయాలన్నారు. బాధ్యతలు త్రికరణశుద్దిగా మోస్తూనే పనిచేయాలని ఇన్చార్జ్ గారి అడుగుజాడల్లో నడవాలని క్రమశిక్షణ ఉల్లంఘించరాదని అన్నారు. పాడేరు ఇన్చార్జ్ డా. గంగులయ్య మాట్లాడుతూ జనసేన పార్టీ మార్పు కోసం ఎగిసిన జ్వాల వంటిదని ఎందరో చదువుకున్న యువరక్తంతో నిండిపోయిందని జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్ స్థాయిని తక్కువ అంచనా వేసే ప్రత్యర్థులకు కచ్చితంగా వచ్చ ఎన్నికలు ఒక గుణపాఠం కానుందని జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గం కైవసం చేసుకుంటుందన్నారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వివిధ మండల అధ్యక్షులకు అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ నాయకులు ఉపధ్యక్షురాలు కిట్లంగి పద్మ, కార్యదర్శి ఉల్లి సీతారామ్, సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్, వీరమహిళలు దివ్యలత, దుర్గాలత, పార్వతి, మండల అధ్యక్షులు మాసాడి భీమన్న, సీసాలి భూపాల్, టీవీ. రమణ, తల్లే త్రిమూర్తులు, వంతల బుజ్జిబాబు, కొయ్యం బాలరాజు, సుర్ల సుమన్, గూడెపు లక్ష్మణ్ రావు, పెద్దఎత్తుననియోజకవర్గ జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.