రాజానగరం నియోజకవర్గంలో వైస్సార్సీపీకి షాక్ ఇచ్చిన మహిళలు

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలంలో అధికార వైస్సార్సీపీ ప్రభుత్వ ఆగడాలు, అరాచకాలు చూసి విసిగి వేసారిపోయి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ నిత్యం ప్రజల గురించి పాటు పడుతూ.. ప్రజా క్షేమమే లక్ష్యంగా.. నియోజకవర్గ అభివ్రుద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న విధానం నచ్చి నేడు స్వచ్చందంగా మహిళలు బలరామకృష్ణ స్వగృహం నందు గౌరవపూర్వకంగా కలిసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో అల్లు యజ్ఞవతి, ముచ్చకర్ల లక్ష్మి, ముచ్చకర్ల సావిత్రమ్మ, ముచ్చకర్ల భీమరాజు, ముచ్చకర్ల సత్యవేణి, జెట్టి మహేష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.