పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య జీవితం అందరికీ ఆదర్శనీయం

సత్తెనపల్లి, స్వర్గీయ వావిలాల గోపాలకృష్ణయ్య 20 వ వర్ధంతిని సత్తెనపల్లిలోని జనసేనపార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఇంఛార్జి శిరిగిరి మణికంఠ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వావిలాల చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా సంయుక్త కార్యదర్శి, తిరుమలశెట్టి మల్లేశ్వరి మాట్లాడుతూ వావిలాల స్వాతంత్ర్య సమరయోధులుగా, సత్తెనపల్లి నుండి నాలుగుసార్లు ఎన్నికైన శాసనసభ్యునిగా, మద్యపాన నిషేధ మహోద్యమాన్ని నడిపిన నేతగా అందరికీ తెలుసుననీ, కానీ నేటితరంలో చాలా మందికి తెలియని ముఖ్యమైన విషయాలు మరికొన్ని ఉన్నాయని అన్నారు. గ్రంథాలయోద్యమం చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి గ్రంథాలయాన్ని సత్తెనపల్లిలో నెలకొల్పడం, సహకారోద్యమానికి నాయకత్వం వహించడం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బహుళార్థసాధక ప్రాజెక్ట్ నాగార్జునసాగర్ నిర్మాణంకు కృషి చేయడం, తెలుగు అధికార భాషాసంఘంను స్థాపించి ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే వచ్చేలా చేయడం, తెలుగు సాహిత్యసేవ చేయడంతో పాటు స్వయంగా రచనలు చేయడం, తెలుగులో టైప్ రైటర్ ను తయారు చేయించడం, పుల్లరి ఉద్యమంలో జైలు జీవితం వంటివి వావిలాల జీవితంలో మరికొన్ని ముఖ్యఘట్టాలు అని ఆయన అన్నారు. వారి సేవలకు గుర్తింపుగా వారు కళాప్రపూర్ణ, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించబడ్డరాని ఆయన కొనియాడారు. అనంతరం జనసైనికులు, వీరమహిళలు అందరూ కలసి పట్టణంలోని వావిలాల ఘాట్ ను సందర్శించి మన్నవ షోడేకర్ ఆధ్వర్యంలో వావిలాల విగ్రహానికి పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దమ్మాలపాడు ఎంపీటీసీ సిరిగిరి రామారావు, రాడ్లు శ్రీనివాసరావు, గ్రామ అధ్యక్షులు రుద్రజడ శివయ్య, తిరుమలశెట్టి గోపి, తుమ్మల సురేష్, తిరుమల శెట్టి సాంబ, పోతంశెట్టి వెంకటేష్, ఏలిశెట్టి రాంగోపాల్, అన్నపురెడ్డి శ్రీనివాసరావు, జనసేన సుబ్బారావు, అంచుల వెంకీ, యద్దనపూడి నరేష్, జైపాల్, షేక్ కాజా, గర్నెపూడి చిన్ని, ప్రభు, ఆదినారాయణ, సత్తనపల్లి సైదేశ్, ఐలం ఆదినారాయణ, చిట్టాలు తదితరులు పాల్గొన్నారు.