నేటి నుండి పద్మనాభస్వామి ఆలయ దర్శనo

తిరువనంతపురం లోని పద్మనాభస్వామి ఆలయాన్ని నేటి నుండి భక్తుల సందర్శన కోసం తెరవనున్నారు. కొవిడ్‌-19 కారణంగా ఆలయ సందర్శనను మార్చి 21 నుంచి నిలిపివేశారు. భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకునేలా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. దర్శనం కోసం భక్తులు ఆన్‌లైన్‌లో ఆలయ వెబ్‌సైట్‌ www.spst.in లో బుక్‌ చేసుకోవాలని సూచించారు. రోజులో గరిష్ఠంగా 665 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు.