డా.బి.ఆర్.అంబేద్కర్ కు పాలకొల్లు జనసేన నివాళులు

పాలకొల్లు: జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత రత్న డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు చేగొండి సూర్య ప్రకాష్ విచ్చేశారు. ఆయనతో పాటు జిల్లా సెక్రటరీ బోనం చినబాబు, జిల్లా జాయింట్ సెక్రటరీ ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సూర్య ప్రకాష్ మాట్లాడుతూ జాతీయ నాయకుడైన డా.అంబేద్కర్ నిత్య స్మరణీయుడు అని ఆయన ఆలోచనలతో నడిస్తే ప్రతి రాష్ట్రం అద్భుతంగా ఉంటుందని తెలియజేసి ఆయనకు నివాళులు అర్పించారు. చినబాబు మాట్లాడుతూ భారత రత్న అంబేద్కర్ సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ పార్టీ ని నడుపుతున్నారని అంబేద్కర్ కి పాలకొల్లు నియోజకవర్గం తరపున నివాళులు అర్పించారు. ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఓటు హక్కును ప్రసాదించిన మహానుభావుడు రిజర్వ్ బ్యాంకు స్థాపనలో ముఖ్యుడు, ప్రపంచం లో ఉన్నత విద్యను అభ్యసించిన వారిలో అగ్రగణ్యుడు, స్త్రీ హక్కుల పోరాటయోధుడు, శ్రామికుల పక్షపాతి, కుటుంబసభ్యులు చనిపోయినా వెళ్లకుండా స్వాత్రంత్ర్య పోరాటం లో అరెస్ట్ అయిన వారిని విడిపించి తరువాత వెళ్లిన గొప్ప స్వాత్రంత్ర్య సమరయోధుడు, కులరహిత సమాజం కోసం నిరంతరం పోరాటం చేసిన పోరాట యోధుడు అంబేద్కర్ కి జనసేన పార్టీ తరపున నివాళులు అర్పిస్తున్నాము. పవన్ కళ్యాణ్ నిత్యం ఆయన ఆశయాలకోసమే పని చేస్తున్నారు. పార్టీ లో తిరగడానికి గర్వంగా ఫీల్ అవుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జిల్లా కార్యక్రమాల నిర్వహణ సభ్యుడు కొప్పిశెట్టి నాగరాజు, పోడూరు మండల అధ్యక్షులు పితాని వెంకటేష్, యాళ్ల రవీంద్ర నాయుడు, కాశెట్టి సురేంద్ర, గంట ముత్యాల రావు, ఇనుకొండ రమేష్, ఆర్.డి. ప్రసాద్, వెంకట నాయుడు, పోసింశెట్టి రమేష్, వేపుగంటి రమణ, కనపాల దాసు, యడ్ల పసాద్, లంక బోస్, చివటం వెంకట నాయుడు, వీర మహిళలు జిత్తుగ రియా, మైగాపుల పద్మజ, ముత్యాల అశ్విని తదితరులు పాల్గొన్నారు.