డిజిటల్ కాంపెయిన్ లో పామర్రు జనసేన

విశాఖ శాఖ ఉక్కు పరిరక్షణకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరాడతామని పామర్రు జనసేన పార్టీ ఇన్చార్జి తాడిశెట్టి నరేష్ తెలిపారు. పామర్రు జనసేన పార్టీ కార్యాలయంలో తాడిశెట్టి నరేష్ మీడియాతో మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ప్రాణార్పణ తో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తూంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రయత్నించకపోవడం దారుణమన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేసే వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో తమ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి పోరాడతామని తాడిశెట్టి నరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూనపరెడ్డి సుబ్బారావు, పంచకర్ల సందీప్, అడపా నాగేశ్వరావు, వీర మహిళలు, మహిళా నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.