పండ్రా రంజిత్ మిత్రుల సంబరాలు

కడప, జనసేన పార్టీ 2024 ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ రాయలసీమ జోన్ 1 కో-కన్వీనర్ గా పండ్రా రంజిత్ కుమార్ కు పదవి రావడంతో కడపలో తన ఆప్తులు మిత్రులు సంబరాలు చేసుకున్నారు. అందులో భాగంగా మొదట జనసైనికులు రామసిద్దు, రాము, శివ, వారి బృందం కడపలో రంజిత్ కుమార్ ను ప్రత్యేకంగా కలిసి శాలువ బొకే సత్కరించారు. మరియు కడప స్థానిక 48వ డివిజన్ అక్కయ్యపల్లిలోని సాయికృష్ణ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణసంచా కాల్చి ఆయనకు ఘనస్వాగతం పలికి శాలువా బొకేతో సత్కరించారు. అనంతరం కడప జనసేన పార్టీ నాయకులు అబ్బన్నగారి రాజగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక ప్రేమాలయ ఆశ్రమంలో నిరుపేద అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వారి మధ్యలో సంబరాలు చేసుకొని అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మం నాయక్, బాలు నాయక్, కుమార్ నాయక్, సుధీర్ నాయక్, రూప్ కుమార్, మనీ, వంశీకృష్ణ, రాజా, రాజశేఖర్, జానీ, సద్దాం, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.